- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టైం టు టైం షెడ్యూల్ ఫాలో కావాలి
దిశ, బూర్గంపాడు : భద్రాచలంలో గురువారం జరగనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ వస్తున్నందున అధికారులు ఉదయం 6 గంటలకే కేటాయించిన విధులకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. గవర్నర్ పర్యటనపై బుధవారం బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ, డీఆర్డిఏ, జెడ్పీ,
పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలకు విధులు కేటాయించిన సెక్టార్ల అధికారులు సకాలంలో చేరుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారని కోరారు. గవర్నర్ టైం టు టైం షెడ్యూల్ ఫాలో కావాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డిఓ విద్యాచందన, జెడ్పీ సీఈవో ప్రసూన రాణి, డీపీఓ చంద్రమౌళి, ఆర్డీఓలు దామోదర్ రావు, మధు, ఎస్డీసీ సుమ తదితరులు పాల్గొన్నారు.