- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
దిశ, వర్గల్ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మంగళవారం నాచగిరి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉద్దెర మాటలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.
రైతులకు బోనస్ ఇస్తానని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొఖం చాటేసిందన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అన్నారు. బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, నాయకులు నందన్ గౌడ్, మంకిడి స్వామి, రవీందర్ గౌడ్, రమేష్, మహిపాల్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.