మున్నేరుకు మూడో ప్రమాద హెచ్చరిక

by Muthe.Rajitha |

మొంథా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.

మున్నేరుకు మూడో ప్రమాద హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలో మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 25 అడుగులకు పైగా ప్రవాహం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతికి పరిసర కాలనీల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాసాలు, వ్యాపార సముదాయాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, మేయర్‌ నీరజ పరిశీలించారు. వరద తగ్గేవరకు మున్నేరు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story