పాన్ కట్టు... ఓటు పట్టు...

by Disha Web Desk 15 |
పాన్ కట్టు... ఓటు పట్టు...
X

దిశ, ఖమ్మం : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఖమ్మం కార్పొరేషన్ 45వ డివిజన్ లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. స్టేషన్ రోడ్ లో గల పాన్ షాప్ నందు స్వయంగా పాన్ కట్టి అక్కడికి వచ్చిన ప్రజలకు అందించి ఓట్లు అభ్యర్ధించారు. అనంతరం స్టేషన్ రోడ్ సెంటర్ లో చెప్పుల దుకాణంలో చర్మకారుడితో కలిసి చెప్పులు కుట్టారు. శ్రామికుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ఉన్నానని గుర్తు చేశారు. హోటల్లో టీ చేసి అక్కడ ప్రజలకు అందించారు. మహిళలు, చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో నేడు చిరు వ్యాపారాలు గణనీయంగా పెరిగారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆర్థిక వెసులుబాటే అన్నారు.


Next Story