జాగ్రత్త... మీకు కాలం దగ్గర పడింది... రేగా సీరియస్ వార్నింగ్

by Dishanational1 |
జాగ్రత్త... మీకు కాలం దగ్గర పడింది... రేగా సీరియస్ వార్నింగ్
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మరోసారి సోషల్ మీడియాలో బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ నాయకుడు కేటీఆర్ పై బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ఆయన్ను ఏమి చేయలేరని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. కేటీఆర్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలు బీజేపీని బొందపెట్టడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. బీజేపీ నాయకులరా..! ప్రజలు మిమ్మల్ని ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశంలోనే బొందపెట్టబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు బీజేపీ నాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ పెద్ద నాయకులు త్వరలో ఇద్దరిని పిచ్చి ఆసుపత్రి ఎర్రగడ్డలో చేర్చకపోతే బీజేపీకి 2 ఓట్లు నష్టపోతాయని హార్ట్ కామెంట్స్ చేశారు. మత పిచ్చిగాళ్లు దేశానికి పట్టిన పీడ అని, ఆ పీడను వదిలించడానికే తెలంగాణ బిడ్డ బయలుదేరిండన్నారు. బీజేపీ నాయకులకు కళ్లు మూసినా, తెరిచినా కేసీఆర్ రే కనిపిస్తాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. జాగ్రత్త.. తెలంగాణ గురించి గానీ, టీఆర్ఎస్ నాయకుల గురించి గానీ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మీకు కాలం దగ్గర పడినట్లేనని సోషల్ మీడియా ద్వారా గుర్తు చేశారు.


Next Story

Most Viewed