ఎన్నికల సమయంలో కొత్త వేశాలతో వస్తుంటారు: Minister Puvvada Ajay Kumar

by Disha Web Desk 2 |
ఎన్నికల సమయంలో కొత్త వేశాలతో వస్తుంటారు: Minister Puvvada Ajay Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిటీ బస్టాండ్‌ను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా 250 బస్సులను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేవారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల సమయం కావడంతో కొత్త నాయకులు.. కొత్త వేశాలు వేసుకొని వస్తుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read...

వాళ్లతో కలిసి నేను కూర్చోలేను: ఎంపీ కోమటిరెడ్డి

Next Story

Most Viewed