- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడిపై పాలకవర్గం గుస్సా..!
దిశ, కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ లో వ్యతిరేకత కుంపటి రాజుకుంటుంది.జిల్లా అధ్యక్షుడు శంకరయ్య అవలంబిస్తున్న తీరుకు నిరసనగా గురువారం బావుపేట లోని యూనియన్ కార్యాలయంలో ఎదుట పాలకవర్గ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా గ్రానైట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలల నుండి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు శంకరయ్యపై ఫైర్ అయ్యారు.కనీసం వాట్సాప్ గ్రూప్ లో నైనా స్పందించడం లేదన్నారు.అసోసియేషన్ కి సంబంధించిన నిధులు కూడా లెక్కలు లేకుండానే ఖర్చు చేశారని ఆరోపించారు.
గత పదేళ్లుగా చేసిన లెక్కలు చెప్పాలని,ఇందులో సభ్యులు చెల్లించిన నగదు ఎంత ఉంది,అసోసియేషన్ లాభాల్లో ఉందా లేక నష్టాల్లో ఉందా అనేది వివరాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఎన్ని కోట్లు మోసం చేసారనే భావన కలుగుతుందన్నారు.సభ్యుల ఆమోదం లేకుండా తమ ఆనందం కోసం దేశ విదేశాలకు వెళ్లారంటూ ఓనర్లు ఆరోపించారు.అసలు అసోసియేషన్ బిల్డింగ్, షట్టర్స్ ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ అయిందో, పర్మిషన్ ఎవరి పేరిట ఉందో తెలియాలన్నారు. అసోసియేషన్ షెట్టర్స్ తాళాలు వేసి ఉంచడాన్ని పాలకవర్గ సభ్యులు తప్పుబట్టారు.10ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.అసోసియేషన్ బాడీని రద్దు చేయాలని ఇండస్ట్రీస్ యజమానులు డిమాండ్ చేశారు.వెంటనే ఇప్పుడున్న అసోసియేషన్ బాడీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.