సమీపిస్తున్న గడువు.. లక్ష్యానికి దూరంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి

by Dishanational2 |
సమీపిస్తున్న గడువు.. లక్ష్యానికి దూరంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి
X

దిశ, పెద్దపల్లి: సింగరేణి సంస్థ 2022‌‌‌‌‌‌0-23‌‌‌‌‌‌‌‌‌‌ వార్షిక బొగ్గు లక్ష్యానికి గడువు సమీపిస్తున్నప్పటికీ అనుకున్న ఉత్పత్తి మాత్రం దూరంగా కనిపిస్తుంది. వార్షిక సంవత్సరం 50రోజులు మాత్రమే మిగిలి ఉండగా ప్రస్తుతం రోజుకు 2.2 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా మిగిలిన సమయంలో రోజుకు 3లక్షల మెట్రిక్​ టన్నుల ఉత్పత్తి సాధిస్తేనే అనుకున్న లక్ష్యం చేరే అవకాశం ఉందని సింగరేణి అధికారులు అంటున్నారు. ఇప్పటికే పలు డివిజన్లు 10నెలల్లో 100శాతం ఉత్పత్తి సాధించగా ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రతియేటా కార్మికులకు ఇచ్చే ప్రోత్సాహకాలను సంస్థ ప్రకటించ లేదు.

తెలంగాణ సిరుల మాగాణి సింగరేణి సంస్థ 2022–23 ఆర్ధిక సంవత్సరానికి గాను 70 మిలియన్​ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈఏడాది వర్షకాలంలో జూన్​, జూలై, ఆగస్టు మాసంలో కురిసిర భారీ వర్షాల కారణంగా ఓపెన్​ కాస్ట్​ గనుల్లో ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాకపోవడంతో గడిచిన 10 నెలల ఉత్పత్తి లక్ష్యం​లో సింగరేణి సంస్థ వెనుకబడి ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 59మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాల్సి ఉండగా సుమారుగా 54 మిలియన్​ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి సాధించింది. మరో 5మిలియన్​ టన్నుల ఉత్పత్తిలో సింగరేణి సంస్థ వెనుకంజలో ఉన్నది. మార్చి చివరి వరకు సింగరేణి సంస్థ 16మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉన్నది.

రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం..

మార్చి చివరి వరకు సింగరేణి సంస్థ అనుకన్న లక్ష్యం సాధించాలంటే ప్రస్తుతం రోజుకు 3లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ప్రస్తుతం పరిస్థితుల్లో సింగరేణి సంస్థలో రోజుకు 2.2 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అయితే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించడానికి ప్రతియేడాది కార్మికులకు ప్రోత్సాహకాలను అందిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఈసారి ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి సంస్థ ఏలాంటి ప్రోత్సాహకాలను ప్రకటించలేదు.

పలు చోట్ల 100శాతం ఉత్పత్తి

సింగరేణి సంస్థకు కొత్త గూడెం, ఇల్లెందు, మణుగూరు, రామగుండం రివిజన్​ –1, రామగుండం రివిజన్​ –2 , ఆర్టీ–3 ( ఆడ్యాల లాంగ్​ వాల్ ప్రాజెక్ట్) భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్​ డివిజన్ల ఉన్నాయి. 11 డివిజన్లకు నిర్ణయించిన ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించగా నాలుగు డివిజన్ల 10నెలల్లో నిర్దేశించిన 100శాతం ఉత్పత్తి సాధించినట్లు సింగరేణి అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ​10నెలల్లో ఇల్లెందు, మణుగూరు, రామగుండం రిజియన్​​ –1, రామగుండం రిజియన్​–2లు 100శాతం ఉత్పత్తి సాధించినట్లు సింగరేణి అధికారులు చెబుతున్నారు. మరో 50రోజులు గడిస్తే సింగరేణి సంస్థ 2022–23 ఆర్ధిక సంవత్సరంలో ఉత్పత్తి సాధిస్తుందో లేదో తెలిపోతుంది.


Next Story