- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో 8మందికి తీవ్రగాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల నుండి రాజరాంపల్లి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఆటో ను ఢీ కొట్టడంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయలైన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. కరీంనగర్ కి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా వెల్గటూర్ వైపు నుంచి మల్యాల వైపునకు వెళుతుండగా.. ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ అతి వేగంగా ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదానికి గురైన వారంతా మల్యాల మండల కేంద్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గొల్లపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు