- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఉడుములెక్క వచ్చిండు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఉడుములెక్క వచ్చిండు అని.. గీత గీసుకొని ఎవరినీ ఎలా తొక్కాలి ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నాడని తెలిపారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న నన్ను పొమ్మనలేకపొగ బెట్టారు. ఉన్న పార్టీని విడిచి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోయేవాడు ఒకడుంటాడు. కానీ మనం ప్రజా సంక్షేమం కొరకు ముందడుగు వేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమనేతగా కేసీఆర్ కృషి చేశారు. పదేళ్లు సీఎం గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుబంధు ఇచ్చి మూడు ఎగ్గొట్టిండు రైతుకు ఆత్మ ధైర్యం నింపిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ కంటే మెరుగైన పాలన కావాలని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్లకంటే కేసీఆర్ నయమని జనాలు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి ఒక్కరూపాయి అయినా ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఉడుములెక్క వచ్చిండు అని.. గీత గీసుకొని ఎవరినీ ఎలా తొక్కాలి ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నాడని తెలిపారు. నా భవిష్యత్ మీ చేతిలో ఉంది. నాకు అండగా నిలబడండి. నన్ను ఆశీర్వదించండి. భవిష్యత్ ప్రయాణం కలిసి కొనసాగిద్దాం అని పేర్కొన్నారు జీవన్ రెడ్డి.






