‘పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలి’

by Disha Web Desk 23 |
‘పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలి’
X

దిశ,సుల్తానాబాద్ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వెంటనే మార్చాలని మాదిగలు ఆందోళన చేశారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన ఊట్ల వరప్రసాద్ కు గానీ, పార్టీకి పనిచేసిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఏ వ్యక్తికైనా టికెట్ ఇవ్వాలని స్వచ్చందంగా ఢిల్లీకి వచ్చిన ఊట్ల వరప్రసాద్ మద్దతు దారులు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ " మూడు నెలల ముందు పార్టీలో చేరిన గడ్డం వివేక్ కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వడం సరికాదని, గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ కి చేసిన సేవలు ఏమిటని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు ఇవ్వడం దేశంలో , ప్రజలు చెడు సంకేతాలు వెళుతున్నాయని, ఇప్పటికైనా అభ్యర్థిని మార్చి పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల సేవలను, త్యాగాలను గుర్తించి వెంటనే పెద్దపల్లి పార్లమెంటు టిక్కెట్ మార్చలని పార్టీ కోసం కష్టపడిన వారికే ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed