పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి

by Bhanu |

పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగిన్ పెల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి
X

దిశ, కోరుట్ల రూరల్: పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగిన్ పెల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నల్ల నవీన్, ముక్కెర గంగారెడ్డి ల మధ్య గత కొంత కాలంగా పాత కక్ష్యలు ఉన్నాయని, ఈ క్రమంలో గంగారెడ్డి గ్రామంలోని బస్టాండ్ వద్ద గల హోటల్ లో టీ తాగుతుండగా నవీన్ కత్తితో దాడికి పాల్పడినట్లు వారు తెలిపారు. కాగా తీవ్ర గాయలపలైన గంగారెడ్డిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.




Next Story