జగిత్యాల రొహింగ్యాలకు అడ్డాగా మారింది : అరవింద్

by Disha Web Desk 23 |
జగిత్యాల రొహింగ్యాలకు అడ్డాగా మారింది : అరవింద్
X

దిశ,రాయికల్: జగిత్యాల రొహింగ్యాలకు అడ్డాగా మారిందని, ఎమ్మెల్సీ గడిచిన ఏళ్లలో జగిత్యాలను అభివృద్ధి చేయలేదని ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రాన్ని రోహింగ్యాలకు అడ్డాగా చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ముస్లింలకు వంత పాడుతున్నాడని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన యూనిఫాం సివిల్ కోడ్, తదితర బిల్లులకు మద్దతు పలక లేదని జగిత్యాల జిల్లా కేంద్రాన్ని పి ఎప్ ఐ లాంటి నిషేధిత సంస్థలకు అడ్డా కావడానికి ఇలాంటి నాయకులే కారణమని ఆయన హెద్దేవా చేశారు. ఎన్నికలు ఉన్నంతకాలం హిందువులకు దగ్గరగా ఉన్నట్లు నటిస్తూ ఎన్నికలు కాగానే రోహింగ్యాలకు ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతాడని హిందువులకు దేశ సభ్యత్వం అవసరం లేదు కానీ ముస్లింలకు అవసరం ఉందని ఆయన సంచలన వాక్యాలు హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాడని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయలేదని రైతులను అనగా తొక్కిందని ఇచ్చిన మాట మేరకు పసుపు బోర్డు తీసుకొచ్చి పసుపు పంట ధర అత్యధిక స్థాయికి తీసుకొచ్చామని వ్యవసాయ సంబంధిత ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని పసుపు, సుగంధ ద్రవ్యాలు, చెరుకు, బియ్యం, తదితర ఉత్పత్తి రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్ప్ వలసలను నివారిస్తామని, చక్కర ఫ్యాక్టరీలు త్వరలోనే తెలుస్తామని కమిటీలు వేసి చెప్పే ఈ పెద్ద మనిషి వాటి విలువ లెక్క ఒకటి నిబద్ధతతో పారదర్శకతతో తెలిపితే 120 రోజుల్లో చక్కెర పరిశ్రమలను ప్రారంభిస్తామని ఈ సవాలు స్వీకరించి మాకు అప్పగించాలని అన్నారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మాట్లాడుతూ.. జగిత్యాల కు ఏం చేయలేదు జీవన్ రెడ్డి అని తన రాజకీయ సుదీర్ఘ కాలంలో నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయలేదని రైతులను అనగా తొక్కిందని ఇచ్చిన మాట మేరకు పసుపు బోర్డు తీసుకొచ్చి పసుపు పంట ధర అత్యధిక స్థాయికి తీసుకొచ్చామని వ్యవసాయ సంబంధిత ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని పసుపు, సుగంధ ద్రవ్యాలు, చెరుకు, బియ్యం, తదితర ఉత్పత్తి రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్పవలసలను నివారిస్తామని, చక్కర ఫ్యాక్టరీలు త్వరలోనే తెలుస్తామని కమిటీలు వేసి చెప్పే ఈ పెద్ద మనిషి వాటి విలువ లెక్క ఒకటి నిబద్ధతతో పారదర్శకతతో తెలిపితే 120 రోజుల్లో చక్కెర పరిశ్రమలను ప్రారంభిస్తామని ఈ సవాలు స్వీకరించి మాకు అప్పగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల తిరుపతి మండల అధ్యక్షులు అన్నవేణి వేణు,ఎంపీటీసీ రాజనాల మధు,పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed