అమ్మో కొండచిలువ....ఇండ్లలోకి వచ్చింది !

by velandi.Saikiran |

అడవుల్లో ఉండాల్సిన జంతువులు, పాములు, కొండచిలువలు కొన్నిసార్లు గ్రామాల్లోకి,రావటం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అదే రీతిలో

అమ్మో కొండచిలువ....ఇండ్లలోకి వచ్చింది !
X

దిశ, సైదాపూర్: అడవుల్లో ఉండాల్సిన జంతువులు, పాములు, కొండచిలువలు కొన్నిసార్లు గ్రామాల్లోకి,రావటం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అదే రీతిలో కొండచిలువ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని ఇండ్లలోకీ మంగళవారం రాత్రి ప్రవేశించింది. దీంతో గ్రామానికి చెందిన యువకులు కొండచిలువను వీడియోలు తీస్తూ గుట్ట వైపు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దింతో గ్రామస్తులు భయాందోళనలు గురై తున్నారు. అయితే చుట్టుపక్కల శిథిలావస్థకు చేరిన ఇండ్లు, ఊరగుట్ట ఉండటంతో, తరచూ పాములు వస్తున్నాయని, ఇప్పుడు ఏకంగా కొండచిలువ వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలో పనిచేసే కారోబార్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Next Story