"నా భూమి నాకు ఇప్పించండి" బాధితుడు ఫిర్యాదు

by Ratna Kumari |

"నా భూమి నాకు ఇప్పించండి" అంటూ ఇప్పించండి అంటూ బాధితుడు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశాడు.

నా భూమి నాకు ఇప్పించండి బాధితుడు ఫిర్యాదు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన అడ్డాగట్ల భూమయ్య, గంగాధర్ లు అన్నదమ్ములు. వీరి తండ్రి మరణించిన అనంత‌రం విరసత్ ద్వారా ఇద్దరికి సమానంగా ఆస్తి పంపకం జరిగింది. కానీ తన అన్న అడ్డాగట్ల గంగాధర్ త‌న‌కు తెలియకుండా ఆక్రమంగా భూమి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మోకా మీద మేము ఉన్నప్పటికి పట్ట త‌న పేరు మీద ఉందంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టిన పెద్ద మనుషుల మాట వినడం లేదని ఆవేదన వ్య‌క్తం చేశాడు. భూమయ్య మా భూమి మాకు ఇప్పించాలని మమ్మల్ని ఆదుకోవాలనీ ప్రజావాణి లో పిర్యాదు చేశాడు.

Next Story