హుజురాబాద్ లో గంజాయి పట్టివేత

by velandi.Saikiran |

హుజురాబాద్ లో గంజాయి పట్టుబడింది.

హుజురాబాద్ లో గంజాయి పట్టివేత
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ లో గంజాయి పట్టుబడింది. ఏసీపీ మాధవి ఆదేశాల మేరకు హుజురాబాద్ CI కరుణాకర్ బృందం.. వాహనాల తనిఖీ చేస్తుండగా, బుధవారం పరకాల క్రాస్ రోడ్ లో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తుల నుంచి 100 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి హుజురాబాద్ కు చెందిన చెందిన రాజేష్, వరంగల్ జిల్లాకు చెందిన ఫరూక్, రబ్బానీలు కలిసి హుజురాబాద్ ప్రాంతం లో గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు ఈ సంద‌ర్భంగా గుర్తించారు. వీరు ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలను లక్ష్యంగా చేసుకుని... ఈ వ్యాపారం చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.

Next Story