- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైస్ మిల్లులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
by Vinod kumar |
వెల్గటూర్ మండలం సంకెనపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో సోమవారం సాంకేతిక లోపంతో అగ్నిప్రమాదం జరిగింది.

X
దిశ, వెల్గటూర్: వెల్గటూర్ మండలం సంకెనపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో సోమవారం సాంకేతిక లోపంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న జగిత్యాల ధర్మపురి ఫైర్ ఇంజన్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైస్ మిల్ లోని ఎలివేటర్ పైన ఉన్న మోటార్ కు పవర్ ను అందించే కరెంటు వైర్ పేలిపోయి అగ్ని ప్రమాదం ఏర్పడినట్లు గుర్తించారు.
ఈ ప్రమాదం వల్ల మిల్లులోని డ్రైయరు స్టీం పైపులైను, వెల్ వెటరు మోటార్, డ్రయర్ లో ఉన్న 400 క్వింటాళ్ల ధాన్యం కాలిపోయింది. ప్రమాదవశాత్తు ఏర్పడిన అగ్ని ప్రమాదం వల్ల రూ. 15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రాజరాజేశ్వరి మిల్లు నిర్వాహకులు జి. మహేందర్ రెడ్డి తెలిపారు.
Next Story






