ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. ముగ్గురి మృతదేహలు వెలికితీత

by Disha Web Desk 4 |
ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. ముగ్గురి మృతదేహలు వెలికితీత
X

దిశ, రామగిరి: రామగుండం 3 ఏరియా అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో పైకప్పు కూలిన ఘటనలో విషాదమే మిగిలింది. అందరూ ప్రాణాలతో బయటపడతాయని చూసిన వారి ఆశలు ఆవిరి అయ్యాయి. ఎట్టకేలకు మంగళవారం అర్థరాత్రి ముందు ఒకరిది, తర్వాత ఇద్దరి మృతదేహాలను వెలికి తీసారు. మొదట అసిస్టెంట్ మేనేజర్ తేజావత్ చైతన్య తేజ, తర్వాత కొద్ది సేపటికి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ ల మృతదేహాలను గుర్తించారు. ఒకటిన్నర రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీం అధికారులను కాపాడలేకపోయారు.




Next Story

Most Viewed