లక్ష ఖాతాలు ఓపెన్ చేయడమే లక్ష్యం.. పోస్టల్ ఎస్పీ వై.వెంకటేశ్వర్లు

by Dishafeatures2 |
లక్ష ఖాతాలు ఓపెన్ చేయడమే లక్ష్యం.. పోస్టల్ ఎస్పీ వై.వెంకటేశ్వర్లు
X

దిశ, కరీంనగర్: కొత్త వడ్డీ రేట్లతో లక్ష ఖాతాలను తెరవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సెలవు రోజు ఆదివారం కూడా అన్ని పోస్టాఫీసులు తెరిచే ఉంటాయని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త వడ్డీ రేట్లను ప్రజలకు వర్తింపజేయాలనే సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోస్టాఫీసులు ఆదివారం తెరచే ఉంటాయని, ఆర్థిక చేయూతనిచ్చే వివిధ పథకాలలో ప్రజలు చేరాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం వివిధ ఖాతాలను తెరవడం కోసమే ఆదివారం పోస్టాఫీసులు ఓపెన్ చేస్తున్నామని, ఇతర కార్యకలాపాలేవి కొనసాగవని, ఈ విషయం ప్రజలు గమనించాలని పోస్టల్ ఎస్పీ ఆ ప్రకటనలో కోరారు.


Next Story

Most Viewed