- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే సీపీఐ మద్దతు
దిశ,ఆదిలాబాద్ : దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అణగారిన ప్రజలకు అన్యాయం చేస్తూ.. పెద్దలకు దోచి పెడుతు, కార్పొరేట్ శక్తులకు ప్రోత్సహిస్తూ, మతవాదం తో దేశంలో రాజ్యమేలుతున్న ఈ పార్టీకి సిపిఐ పూర్తిగా వ్యతిరేకమని ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణు శంకర్ స్పష్టం చేశారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా సిపిఐ శ్రేణులు ఎలాంటి వాటికి ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ, దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ కౌన్సిల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం భూపతిరెడ్డి, బి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.