గోదావరిఖనిలో బొగ్గు పట్టివేత

by Dishanational2 |
గోదావరిఖనిలో బొగ్గు పట్టివేత
X

దిశ, గోదావరి ఖని : గోదావరిఖని పట్టణ శివారు లోని సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్ పక్కనుండి అక్రమంగా తరలిస్తున్న బొగ్గు ఉన్న లారీని సింగరేణి సెక్యూరిటీ గార్డు సిబ్బంది పట్టుకున్నారు. మంగళ వారం ఉదయం ఎన్‌టీపీసీకి వెళ్లే రైలు వ్యాగన్ల నుంచి దొంగలు అక్రమంగా సేకరించిన బొగ్గును తరలించే ప్రయత్నం చేశారు. నిఘా వేసిన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బొగ్గు స్వాధీనం చేసుకొని అర్జీ 1 జీ ఎం కార్యాలయానికి తరలించారు.పట్టుకున్న వారిలో సీనియర్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి , ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ , ఏసీటీఎస్‌టీమ్, రఘు, నీలం, రవి, జి. బాపూజీ ఉన్నారు.


Next Story