హుజురాబాద్ లో బీజేపీ దిష్టి బొమ్మ దహనం

by Dishafeatures2 |
హుజురాబాద్ లో బీజేపీ దిష్టి బొమ్మ దహనం
X

దిశ, హుజూరాబాద్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేశారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పై ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో బీజేపీ కార్యకర్తలు శుక్రవారం జమ్మికుంటలో ఎమ్మెల్సీ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీ చర్యను తప్పుబట్టిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు.. ప్రతిగా బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. అనవసరంగా తమ నాయకుడు పాడి కౌషిక్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.




Next Story

Most Viewed