కవితకు బెయిల్ ఇప్పిస్తా! బీఆర్ఎస్‌ను 12 సీట్లతో గెలిపిస్తా.. కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 14 |
కవితకు బెయిల్ ఇప్పిస్తా! బీఆర్ఎస్‌ను 12 సీట్లతో గెలిపిస్తా.. కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీబీఐ, ఐటీ రైడ్స్ భయం ఉంటే తన దగ్గరకు రావాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ పిలుపునిచ్చారు. నేతలకు సీబీఐ, ఐటీ రైడ్స్ భయం ఉన్నవారిని తాను కాపాడుతానని వెల్లడించారు. ఇటీవల లిక్కర్ స్కాం ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితకు ఎవరైనా బెయిల్ ఇస్తారా? అని ప్రశ్నించారు.

న్యాయంగా పోరాడితే బెయిల్ ఇప్పించగలనని స్పష్టం చేశారు. నేడు కేసీఆర్ కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయారని అన్నారు. తాను వంద సార్లు చెప్పారని, మార్పు చెందాలి కేసీఆర్.. లేదంటే నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాం.. అని చెప్పానన్నారు. తనను గతంలో కేసీఆర్ కొట్టించారని గుర్తుచేశారు. ఆ రోజే తాను శపించారని, అందుకే మసైపోయారని విమర్శించారు. ప్రజాశాంతి ఎంపీ అభ్యర్థి బాబు మోహన్‌కు వరంగల్లో కేసీఆర్ మద్దతు ఇస్తే.. నేను నిన్ను 12 సీట్లు మెజార్టీతో గెలిపిస్తా.. అని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed