- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో పాలమూరు ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే?
మహబూబ్నగర్లో బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబ్నగర్లో బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం జుబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar MLAs) ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శాలువ కప్పి సత్కరించారు. ఈ మేరకు కాసేపు సీఎం ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ (IIIT new campus) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్లో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. మహబూబ్నగర్ క్యాంపస్లో ఈ ఏడాది నుంచి మూడు కోర్సులు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 1) ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగ్రాం (6 సంవత్సరాలు) - ఇది రెండేళ్ల ప్రీ-యూనివర్సిటీ కోర్సు, నాలుగేళ్ల బీ.టెక్ను కలిపి ఉంటుంది. ఈ కోర్సు 10వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. 2) ఎం.టెక్ (2 సంవత్సరాలు) - ఇంజనీరింగ్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సు, దీనికి GATE స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. 3) పీహెచ్డీ ప్రోగ్రామ్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన కోసం ఈ కోర్సు ప్రారంభిస్తారు. ఈ క్యాంపస్లో అడ్మిషన్లు, ఫీజు వివరాలు, ఇతర సమాచారం త్వరలో అధికారిక వెబ్సైట్లో www.rgukt.ac.in అందుబాటులో ఉంటుంది. (Basra) బాసర క్యాంపస్లో ఇప్పటికే ఈ కోర్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్నగర్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.






