బడ్జెట్ సెషన్‌లో ఐటీ, ఇన్ ఫ్రా పాలసీలు : మంత్రి శ్రీధర్ బాబు

by Disha Web Desk 4 |
బడ్జెట్ సెషన్‌లో ఐటీ, ఇన్ ఫ్రా పాలసీలు : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూన్‌లో హైదరాబాద్‌లో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. త్వరలో ఏఐ సిటీ నిర్మించాబోతున్నామన్నారు. ప్రపంచ శ్రేణి ఏఐ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామన్నారు. బుధవారం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్.. టెలి‌పర్‌ఫార్మెన్స్ ఇంప్రెసివ్ఎక్స్ పీరియన్స్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.

రేపటి నుంచి బడ్జెట్ సెషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నామన్నారు. 1990వ దశకంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ కి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. తర్వాత ఒక పార్టీ, మధ్యలో కాంగ్రెస్, 2014 లో ఇంకో పార్టీ.. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం.. అయినా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిందన్నారు.

టెలి‌పర్‌ఫార్మెన్స్ డేనియల్‌ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు అనుకూలంగా ఉన్న సిటీలను చూసి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని చెప్పానన్నారు. హైదరాబాద్‌లో అనుకూల వాతావరణం, మానవ వనరులు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పుష్కలంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఐఎస్బీ తరహాలో ఇది స్కిల్డ్ మ్యాన్ పవర్ అందిస్తుంది.. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయి..

రాష్ట్రంలోని గ్రామాల్లోనూ కుటుంబానికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉన్నారు. హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉంది.. ఇక్కడి నుంచి ఏ మెట్రోపాలిటన్ సిటీకి అయిన రెండు గంటల్లో వెళ్లొచ్చన్నారు. ఇక్కడ భూకంపలు రావు, ప్రకృతి విపత్తుల ప్రమాదం లేదన్నారు. హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీ అన్నారు. మా ప్రభుత్వం టూరిజంపైనా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. టూరిజం గ్రోత్ 20 శాతం పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.


Next Story