Malla Reddy : చిరంజీవి కంటే నేనే తోపు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 7 |
Malla Reddy : చిరంజీవి కంటే నేనే తోపు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కంటే తానే తోపునని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా యాక్టర్లతో తనను పోల్చుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో నాకన్నా ఎవరూ ఫేమస్ లేరు. ఇన్ స్ట్రాగామ్‌లో ఏ పేజీ చూసినా మల్లారెడ్డినే కనిపిస్తాడు. ఎందుకంటే మల్లా రెడ్డి సినీ ప్రముఖుల కన్నా ఫేమస్. నేను తుమ్మినా తుఫాన్ అవుతోంది. చేసే వృత్తి చెబితే అది డైలాగ్‌లా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే సోషల్ మీడియాలో నేనే ఫేమస్ అంటూ కామెంట్స్ చేశాడు.

Next Story

Most Viewed