వ్యాయామం వద్దన్నందుకు.. కన్నతల్లినే హతమార్చిన కొడుకు

by Web Desk |
వ్యాయామం వద్దన్నందుకు.. కన్నతల్లినే హతమార్చిన కొడుకు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అర్ధరాత్రి వేళ ఇంట్లో వ్యాయామం చేయవద్దన్నందుకు మానవత్వం మరచిన ఓ కొడుకు కన్నతల్లినే హతమార్చిన సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాంకోఠిలో నివాసముండే కొండ పాపమ్మ(45)కు కొడుకు సుధీర్ కుమార్, మరో కూతురు ఉన్నారు. భర్త సుమారు ఆరేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఇండ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన సుధీర్ కుమార్ ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. సుమారు నెలన్నరగా అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. ఈ క్రమంలో అతను సోమవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఇంట్లో డంబెల్స్‌తో వ్యాయామం చేస్తున్నాడు.

దీంతో నిద్ర చెడిపోతోందని, ఇప్పుడు వ్యాయామం చేయవద్దని తల్లి అతనికి చెప్పడంతో ఆగ్రహానికి గురైన సుధీర్ విచక్షణ కోల్పోయి చేతిలో ఉన్న డంబెల్స్‌తో తల్లి తలపై మోదడంతో తలపగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అతని చెల్లెలు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడి చేయడంతో ఆమెకూ స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి గొడవ విని నిద్రలేచిన స్థానికులు పోలీసులకు చెప్పడంతో వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పాపమ్మ మృతి చెందడంతో సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని చెల్లెలుకు కూడా వైద్య పరీక్షలు అందించారు. అనంతరం సుధీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.



Next Story

Most Viewed