తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక

by Bhanu |   (  Updated:2025-12-13 11:12:19  IST  )

తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా ఎన్నికలు శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అల్కాపురిలో జరిగాయి.

తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక
X

దిశ, వనస్థలిపురం: తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా ఎన్నికలు శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అల్కాపురిలో జరిగాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పున్న శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా చిలుక మధు, కోశాధికారిగా పులిపాటి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా కుర్రే సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా గుజ్జ శైలజ, తేలు శరత్ బాబు, అదిరే చత్రపతి, జాయింట్ సెక్రటరీలుగా గంజి ధనుంజయ్, రంగు సుధీర్ కుమార్, డాక్టర్ రమా శ్రీదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బేతి రాజేందర్, ఆనంద్ దాస్ రామలింగం, యుగంధర్ బాబు, యేషాల శివానందం, మసన శ్రీనివాస్, ముఠా వెంకటేశ్, పబ్లిసిటీ సెక్రటరీగా శ్రీరామ్ సుధాకర్, ఆఫీస్ కార్యదర్శిగా వేపూరి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా గడిపల్లి రమేష్, రామా రవి, రాపోలు సోమేశ్వర్, బొద్దుల వెంకటగిరి ప్రసాద్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, మాజీ అధ్యక్షుడు బాసబత్తిని రాజేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికల అధికారిగా శిరందాసు యాదగిరేందర్ వ్యవహరించారు.

Next Story