- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష..
దిశ, మియాపూర్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయా డివిజన్ల పరిధిలో గల పలు సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని, అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి వినతులను పరిగణలోకి తీసుకొని సత్వరమే పరిష్కరించాలన్నారు.
ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని, సమస్యలను దశల వారిగా పరిష్కారం చేస్తూ అభివృద్ధి చేసుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగరావు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, సమ్మారెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాజు నాయక్, వాలా హరీష్ రావు, గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.