Corporator Navajeevan Reddy : అధికారుల నిర్లక్ష్యం జలమయమైన కాలనీలు..

by Batti.Sumithra |

గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హయత్ నగర్ డివిజన్లోని కాలనీలన్నీ జలమయమైనవని దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Corporator Navajeevan Reddy : అధికారుల నిర్లక్ష్యం జలమయమైన కాలనీలు..
X

దిశ, ఎల్బీనగర్ : గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హయత్ నగర్ డివిజన్లోని కాలనీలన్నీ జలమయమైనవని దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం డివిజన్ పరిధిలోని సిద్ధి వినాయక కాలనీలో ఆయన పర్యటించారు. అధికారులు తక్షణం స్పందించి కాలనీలలో నిలువ ఉన్నటువంటి వర్షపు నీరును లోతట్టు ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని, ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారి ఏఈ చంద్రశేఖర్ ను కోరారు.

Next Story