మోడీని మరోసారి గెలిపించాలి

by Disha Web Desk 15 |
మోడీని మరోసారి గెలిపించాలి
X

దిశ,సికింద్రాబాద్ : దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. శుక్రవారం తార్నాకలోని శ్రీకర్ శ్రీ శ్రీవాస్ అపార్ట్మెంట్స్ లో బీజేపీ జిల్లా కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. అనంతరం ఎస్ఎస్ హైట్స్, కళాకృతి అపార్ట్ మెంట్ వాసులతో ఆయన మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశ సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రదాని మోడీ ని భారీ మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, 4 వందేభారత్ ట్రైన్ల ఏర్పాటు,

ఎంఎంటీఎస్ మూడో దశ పనులను కూడా పూర్తి చేశామని చెప్పారు. చర్లపల్లి టర్మినల్ అభివృద్ధితో పాటు త్వరలో నగరానికి రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుందని అయన అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. అభివృద్ధికి ఓటు వేసి బీజీపీ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ఓటింగ్ శాతం 40 మాత్రమే ఉందని, దీనిపై దృష్టి సారించింది ప్రజలందరూ తన ఓటు హక్కును వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు, మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి, నాయకులు శాస్త్ర మసుందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి మేకల సారంగపాణి, ప్రభుగుప్త, రవిప్రసాద్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, పోచయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed