- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కుల, మత, ప్రాంతీయ బేధాలకు అతీతంగా మోదీకే మద్దతు ; కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దిశ, శేరిలింగంపల్లి : దేశంలో కుల, మతాలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకీ, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లిలో ప్రచారంలో భాగంగా మార్వాడీ సమితి సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మరోసారి నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని అన్నారు.
అయితే లింగంపల్లి ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపించొచ్చని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.