Harishrao: ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది BRS

by Disha Web Desk 16 |
Harishrao: ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది BRS
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పాలనలో తాగడానికి నీళ్లు, రోడ్లు లేవని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పనికిరాని డిక్లరేషన్ అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్‌రావు, ఇతర నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవరిని అడిగినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారు అంటున్నారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని... ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. తెలంగాణను సాధించి చూపెట్టింది కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమాలాంటి చాలా కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి చూపిందని ఆయన తెలిపారు. నాగర్ కర్నూల్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని కలలో కూడా అనుకోలేదని, అలాంటిది ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయని హరీశ్ రావు తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్ వాళ్లు కొబ్బరి కాయలు కొడితే తెలుగు దేశం వాళ్లు మొక్కలు నాటారన్నారు. తెలుగుదేశం వాళ్లు కొబ్బరికాయలు కొడితే ఆ శిలాఫలకాల దగ్గర కాంగ్రెస్ వాళ్లు మొక్కలు నాటారని ఎద్దేవా చేశారు. నీళ్లు మాత్రం రాలేదని, ప్రాజెక్టును పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు నీల్లు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి వచ్చిందంటే కేసీఆర్ వల్లేనని మంత్రి హరీష్ రావు తెలిపారు. శ్రీశైలం ముంపు బాధితులకు జీవో కూడా తమ వల్లే వచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్, ఎందుకు పనికిరాని డిక్లరేషన్ అని కొట్టిపారేశారు. కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ‘తెలంగాణలో ఎలాగో అధికారంలోకి రారని తెలిసే కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు ఇస్తున్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటి అమలు చేయలేదు. తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామన్నారు. 9 గంటల కరెంట్ పగటి పూట ఇస్తామన్నారు. సిలిండర్ ధర తగ్గిస్తం అని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏమి కావాలో చేసే నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మీ, బీడీ కార్మికులకు పింఛన్, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా.. ఇలా చెప్పనవి అనేకం అమలు చేశారు. కొల్లాపూర్ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లనే సాధ్యమైంది. పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరలో ప్రారంభించబోతున్నాం. నాగర్ కర్నూల్ జిల్లా సస్యశామలం అవుతుంది. దళితులు, గిరిజనులపై ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ నటిస్తుంది. వారి వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్, చనిపోయిన తర్వాత కూడా భారతరత్న ఇవ్వని పార్టీ. బాబు జగజ్జీవన్ ప్రధాని కాకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్. దళితుల కోసం వైన్స్, కాంట్రాక్టులు, ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు తెచ్చారు. దళిత బంధు వంటి అద్భుతమైన పథకం ప్రారంభించారు. తండాలు పంచాయతీలు చేశారు. 10 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు.’ అని మంత్రి హరీష్ రావు తెలిపారు.

‘గిరిజనుల కోసం గంటలకు ఎకరం పారుతుందట. మూడు గంటలు ఇస్తే మూడు గంటలు పారుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు ఎట్ల సాధ్యమైతది. నిరంతరం కరెంట్ అన్నారు. చేసి చూపింది కేసీఆర్. రైతులకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తరహా పథకాలు కావాలని ఇతర రాష్ట్రాల నేతలు కోరుతున్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. సీఎం కేసీఆర్ రైతు గౌరవం పెంచారు. తద్వారా రైతు చేతిలో ఉన్న భూమి పెరిగింది. రైతు గౌరవం పెంచిన కేసీఆర్ నాయకత్వం బలోపేతం చేయాలి.’ అని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed