జీహెచ్ఎంసీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు..

by Disha Web Desk 11 |
జీహెచ్ఎంసీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్‌ ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీ రఘురామ్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ సిబ్బంది రాత్రి, తెల్లవారుజామున కష్టతరమైన సమయాల్లో పనిచేస్తారని అన్నారు. ఈ సమయాల్లో పని చేయడం మూలంగా దుమ్ము, వాయు కాలుష్యం బారిన పడతారని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇలా రోడ్లపై పని చేసే జీహెచ్ఎంసీ కార్మికులలో 50ఏళ్లు పైబడిన 400 మందికి పైగా మహిళా కార్మికులకు కిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను చేయడం జరిగిందన్నారు. ఉచిత పరీక్షలను అత్యాధునిక 3డి మామోగ్రఫీ సిస్టంతో మార్చి 8వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు.

రొమ్ము క్యాన్సర్ పై ప్రజల్లో ఇంకా అవగాహన రావాలన్నారు. ముందుగా అన్ని వయసుల స్త్రీలు తప్పనిసరిగా 'రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మహిళలు రొమ్ములో ఏదైనా కొత్త మార్పులను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, ఎండీ డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ పారిశుద్య కార్మికులకు ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చొరవను నిర్వహించాలనే తమ ప్రతిపాదనను తక్షణమే అంగీకరించినందుకు జీహెచ్‌ఎంసీ చైర్మన్ లోకేష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed