HYD: కాసేపట్లో సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్.. ఎవరితో అంటే?

by Disha Web Desk 2 |
HYD: కాసేపట్లో సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్.. ఎవరితో అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్‌ ప్లేయర్ సానియా మీర్జా చివరి మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సానియా ఆదివారం హైదరాబాద్‌లో చివరిసారి బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు కలిసి ఆడిన రోహన్‌ బోపన్న, ఇవాన్‌ డోడిగ్‌, బెతానీ మాటెక్‌ సాండ్స్‌, కారా బ్లాక్‌, మరియన్‌ బర్తోలీతో కలిసి ఆదివారం ఎల్బీ టెన్నిస్‌ స్టేడియంలో సానియా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ‘నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో సొంత అభిమానుల మధ్య ఆడి కృతజ్ఞతలు తెలుపాలనుకుంటున్నాను. ఎక్కడ మొదలు పెట్టానో తిరిగి అక్కడికే రావడం గొప్పగా అనిపిస్తున్నది’ అని సానియా పేర్కొంది. దీంతో ఆమె చివరి మ్యాచ్ చూసేందుకు అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు భారీగా ఎల్బీ స్టేడియానికి రానున్నారు.

Next Story

Most Viewed