కేసీఆర్ సర్కార్ నిర్ణయానికి హైకోర్టు షాక్!

by Disha Web Desk 19 |
కేసీఆర్ సర్కార్ నిర్ణయానికి హైకోర్టు షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు పౌండేషన్‌కు హైదరాబాద్‌లోని ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, ఈ కేటాయింపును సవాల్ చేస్తూ 2019లో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

కాగా, ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వం సాయిసింధు పౌండేషన్‌‌కు చేసిన భూ కేటాయింపును రద్దు చేసింది. భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా దీనిపై పున: పరిశీలన చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Next Story

Most Viewed