మరి కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ.. BRS శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ

by Disha Web Desk 19 |
మరి కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ.. BRS శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేయనుంది. అయితే, కేసు కీలక దశలో ఉందని.. ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు బలంగా వాదిస్తోన్న నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్‌గా మారింది.

కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో ఆమెకు బెయిల్ వస్తుందా.. రాదా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం కోర్టు అనుమతితో ఆమెను కస్టడీకి తీసుకుని రెండు దర్యాప్తు సంస్థలు విచారించాయి. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా కవిత ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అని స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తి నెలకొంది.



Next Story

Most Viewed