- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూజెర్సీలో హరీశ్రావు.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎన్నారైలతో చర్చ
ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతున్నాయని.. ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతున్నాయని.. ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గురువారం అమెరికా న్యూజెర్సీలోని హల్దీ- మౌంట్ లారెల్లో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీశ్రావు కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావుకు బీఆర్ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్, ఎన్నారైలు మహేశ్ తన్నీరు, నరసింహారావు, భాస్కర్ పిన్న, రవీందర్ రావు ఘనస్వాగతం పలికారు. మీట్ అండ్ గ్రీట్లో తెలంగాణ సమకాలీన అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లోనూ ప్రాంతీయ పార్టీల పాత్ర రోజురోజుకూ పెరుగుతున్నదని, కేంద్రంలో కూడా ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. రాష్ట్రం పంజాబ్ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, సంక్షేమం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ వేగంగా అభివృద్ధి సాధించిందని చెప్పారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విజన్ లేని పాలన కారణంగా రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే కాకుండా, కనీసం ఒక ప్లాట్ కొనుగోలు చేయాలన్నా ఎన్నారైలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థిరత్వం, అభివృద్ధిపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. తెలంగాణ సమకాలీన రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్ అంశాలపై ఎన్నారైలు ఆసక్తిగా చర్చించినట్లు హరీశ్రావు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్తో పాటు ఎన్నారైలు మహేష్ తన్నీరు, నరసింహా రావు, భాస్కర్ పిన్న, రవీందర్ రావు, అమర్ గుండ, పరమేశ్ బీం రెడ్డి, చైతన్య చిట్టిమల్ల, వరప్రసాద్, చందు తాళ్ల, పూర్ణ బైరి, నరసింహారెడ్డి, దొంతి రెడ్డి, రజినీ తదితరులు పాల్గొన్నారు.






