- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పనులు ప్రారంభించడమే ఆలస్యం
by Gantepaka Srikanth |
వరంగల్నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీతకు రూ.11.16కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీతకు రూ.11.16కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో 1 నుంచి 3 బ్లాక్ల వరకు రూ.4.21కోట్లు, 4, 5 బ్లాక్ లకు రూ.6.95కోట్లు మంజూరు చేశారు. పూడికతీత ప్రాంతాన్ని రెవెన్యూ శాఖతో కలిసి నిర్ణయించాలని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎంత పూడిక తీయాలనేది శాస్త్రీయంగా నిర్ణయించాలని సూచించారు. పూడికతీత తీసే ప్రతి క్యూబిక్మీటరు వివరాలను లెక్కించాలని సూచించారు. పూడిక తీత సయమంలో వీడియోగ్రఫీ, ఫోటోలు తీయాలని, వాటన్నంటిని భద్రపర్చాలని సూచించారు. ఇంజినీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
Next Story






