Gandhi Bhavan: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

by Ramesh Goud |   (  Updated:2024-12-07 14:16:45  IST  )

గాంధీభవన్(Gandhi Bhavan) లో కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి పాలాభిషేకం(Anointed With Milk) చేశారు.

Gandhi Bhavan: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్: గాంధీభవన్(Gandhi Bhavan) లో కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి పాలాభిషేకం(Anointed With Milk) చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్(Mettu Saikumar) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నదని కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేస్తూ.. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెట్టు సాయికుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Next Story