- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫోన్ట్యాపింగ్లో కీలక సూత్రధారి మాజీ సీఎంకేసీఆరే: బక్క జాడ్సన్
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ఆరోపించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగుల కోసం ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు నేతృత్వంలో టీం ఏర్పడిందని పేర్కొంటూ దీనిపై సమగ్ర విచారణ జరపాలని హైదరాబాద్కమిషనర్కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. దీంట్లో ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్రావు, ప్రణీత్ రావు, శ్రవణ్కుమార్, శ్రీనిధి ఎండీ జీ.విద్యాసాగర్రెడ్డి, ఐటీ మేనేజర్ వేణు ప్రసాద్ల పాత్ర ఉన్నట్టుగా తనకు సమాచారం ఉందన్నారు. 1980 నేషనల్సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
ప్రణీత్రావు అతని టీం సభ్యులు వ్యాపారులు, లాయర్ తో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్చేసి పెద్ద ఎత్తున డబ్బు గుంజినట్టుగా వినతి పత్రంలో పేర్కొన్నారు. స్ర్తీ నిధి ఎండీ విద్యాసాగర్రెడ్డి, ఐటీ మేనేజర్ వేణు ప్రసాద్ కలిసి 30 వేల ట్యాబ్లు, 5వేల కంప్యూటర్లు, ప్రింటర్లు, వేర్వేరు నెట్వర్క్లకు చెందిన 4లక్షల సిమ్ కార్డులు, సర్వీస్ప్రొవైడర్లను సమకూర్చుకుని ఫోన్ ట్యాపింగ్ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వీటి సహాయంతో స్వయం సహాయక బృందాల నాయకులతోపాటు పలువురు ఉద్యోగుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా పేర్కొన్నారు.
24 గంటల పాటు ఉద్యోగుల ఫోన్లను జీపీఎస్ ట్రాకింగ్ లో పెట్టి సేకరించిన సమాచారంతో వారిని బెదిరింపులకు గురి చేశారన్నారు. ఐటీ మేనేజర్కు సచివాలయంలో ఉద్యోగం రావటంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన నియోజకవర్గంలో ఫోన్ల ట్యాపింగ్కోసం ఓ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. దీని కోసం శ్రీనిధి క్రెడిట్కో ఆపరేటివ్ నిధులను వాడుకున్నట్టు ఆరోపించారు.
దీనికి స్ర్తీ నిధి ఎండీ విద్యాసాగర్రెడ్డి, ఐటీ మేనేజర్వేణుప్రసాద్లు సహకరించినట్టుగా తెలిపారు. ఇక, ఐటీ శాఖ మాజీ మంత్రికి అమెరికా, కెనడా, యుకే, సింగపూర్తో పాటు మిడిల్ఈస్ట్దేశాల్లోని మనీ లాండరింగ్ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టుగా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ హోం మంత్రి, మాజీ ఐటీ మినిస్టర్, పంచాయతీ రాజ్మంత్రి, ఆయా శాఖల ప్రిన్సిపల్సెక్రటరీలపై ఎన్ఎస్ఏ యాక్ట్ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరారు.