జగిత్యాలలో ఫ్లెక్సీ వార్! ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ టెన్షన్.. టెన్షన్

by Disha Web Desk 4 |
జగిత్యాలలో ఫ్లెక్సీ వార్! ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ టెన్షన్.. టెన్షన్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : అధికార బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ టార్గెట్‌గా జగిత్యాల పట్టణంలో వెలిసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత జగిత్యాలకు వస్తున్న రోజే ఇలాంటి ఫ్లెక్సీలు దర్శనమివ్వడం అది కూడా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ లీడర్లు కట్టిన ఫ్లెక్సీల పక్కనే ఏర్పాటు చేయడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఖంగుతున్నారు.

గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలైన ఎన్నారై సెల్ ఏర్పాటు, నిరుద్యోగ భృతి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు సర్వత్రా చర్చనీయంశంగా మారాయి. అయితే నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ అరవింద్‌కు పసుపు బోర్డు విషయంలో వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలసిన ఒక రోజు వ్యవధిలోనే అధికార పార్టీకి వ్యతిరేకంగా జగిత్యాల, మెట్ పల్లి ప్రాంతాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల ఈ ప్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు తొలగించారు. అయితే దీని వెనుక బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: MLC కవిత జగిత్యాల పర్యటనలో తీవ్ర విషాదం..

Next Story

Most Viewed