వుమెన్స్ డే రోజే మహిళా జడ్పీటీసీకి అవమానం

by Disha Web Desk 4 |
వుమెన్స్ డే రోజే మహిళా జడ్పీటీసీకి అవమానం
X

దిశ, పెన్ పహాడ్: మహిళలను గౌరవించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పెన్ పహాడ్ మండల మహిళా జడ్పీటీసీ మామిడి అనిత అంజయ్యకు అవమానం ఎదురైంది. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జడ్పీటీసీ మాట్లాడుతూ స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మండల స్థాయి మహిళా దినోత్సవాన్ని ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారన్నారు.

డాక్టర్ తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తాను సకాలంలో హాజరు కాగా తనకు ఉత్తమ జడ్పీటీసి అవార్డు వచ్చిందని అవార్డు తీసుకోవడానికి సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పినట్లు తెలిపారు. ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని వెళ్తానని డాక్టర్‌కు చెప్పానన్నారు. కాగా ఎంపీపి కార్యక్రమాన్ని కొంత సేపు ఆపాలని చెప్పారని అప్పటివరకు ఆగాలని లేకుంటే వెళ్లాలని తనను అవమానించారని జడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు తహసీల్దార్, ఎంపీడీవో ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. అంతే కాకుండా గ్రామాల్లో ఎక్కడా కార్యక్రమాలు జరిగినా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తాను హాజరైన కార్యక్రమంలో ఎంపీపీ కావాలని ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హాజరు కానీ చోట కార్యక్రమాన్ని త్వరగా ముగించి కార్యక్రమం పూర్తి చేసి కావాలని తనను అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.


Next Story

Most Viewed