- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ ఐటీసెల్ విభాగంపై యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు!
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఐటీ సెల్ విభాగం సభ్యులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వక్రీకరించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. బీజేపీ ఐటీ సెల్ విభాగానికి చెందిన పూడురు అరుణ్, అజిత్ భర్తి, రిషి బాగ్రిలు తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరించారని, వాటిని తప్పుగా చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేసి, కులాల వారిగా ఆర్ధికంగా వెనుకబడిన వారిపై కూడ సర్వే నిర్వహించి, అందరికీ అన్ని రంగాల్లోను సమాన హక్కులు కల్పించేలా చేస్తామని చెప్పారని రాహుల్ గాంధీ తుక్కుగూడ సభలో చెప్పారని అన్నారు. కానీ వాటిని ఎడిట్ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన నిర్వహించి, ముస్లింల సంపదను పెంచె విధంగా రాహుల్ గాంధీ మాట్లాడినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలో వస్తుందని తెలిసి, బీజేపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుందని రోహిత్ విమర్శించారు.