వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు అలర్ట్.. కీలక నిర్ణయం దిశగా సర్కార్

by Disha Web Desk 19 |
వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు అలర్ట్.. కీలక నిర్ణయం దిశగా సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో ఫేసియల్​ అటెండెన్స్ ​పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోనున్నారు. మంత్రి ఆఫీస్​నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోని సిబ్బంది వరకు అందరికీ పేస్​స్క్రీనింగ్ పెట్టాలని సర్కార్​ ఆలోచిస్తున్నది. ఇప్పటికే బయోమెట్రిక్​ఉన్నప్పటికీ చాలా మంది టెక్నికల్ మెథడ్‌లతో ఆసుపత్రులు, కార్యాలయాలకు రాకుండానే అటెండెన్స్​వేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని మంత్రి హరీష్​రావు సీరియస్‌గా తీసుకున్నారు.

ఈ పేస్​మిషన్లు స్క్రీనింగ్‌లు కోఠిలోని కమాండ్ కంట్రోల్, హెల్త్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్​ పేషీలకు అటాచ్​ చేస్తారు. ఈ విధానంతో వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొట్టే పరిస్థితి ఉండదని ఆఫీసర్లు చెబుతున్నారు. జీపీఎస్ ​మాప్ ​కెమెరా ద్వారా ఫోటో అటెండెన్స్ ​వేస్తారు. ఖమ్మం , ములుగులో ఇప్పటికే ప్రారంభంగా కాగా.. అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కొందరు విధులకు డుమ్మా కొడుతుండటంతో సర్కార్​ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Next Story

Most Viewed