ఉద్యోగులకు ఈపీఎఫ్ గుడ్ న్యూస్‌!

by Disha Web Desk 4 |
ఉద్యోగులకు ఈపీఎఫ్ గుడ్ న్యూస్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు ఈపీఎఫ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన పింఛనుదారులకు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉమ్మడి ఆప్షన్ లింక్‌ను ఈపీఎఫ్‌ఓ ప్రకటించింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు.. అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ఆ సంస్ధ అవకాశం కల్పించింది.

ఇందు కోసం ఆన్ లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఉమ్మడి ఆప్షన్ లింక్ ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) ఆదివారం అర్థరాత్రి విడుదల చేసింది. ఇంతకుముందు 202 నవంబరు 4న సుప్రీం కోర్టు ఈపీఎస్ కింద అధిక పింఛను దరఖాస్తు చేసుకునేందుకు నాలుగు నెలల సమయం ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం 1995 చట్ట సరవణను ముందుగా(2014 సెప్టెంబర్ 1 కి ముందు) ఈపీఎఫ్ చందాదారుగా చేరి, ఆ తర్వాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ.. ఈపీఎస్ చట్టంలోని పేరా నం.11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారు అర్హులని పేర్కొంది.

యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు గడువు మే 3గా విధించింది. ఈ గడువులోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతన జీవులు ఉమ్మడి ఆప్షన్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ అప్లై ఇలా.. ఈపీఎఫ్ లో వేతన జీవులు, పింఛను దారులు ఈపీఎఫ్ మెంటర్ పోర్టల్ హోంపేజీలో ప్రత్యేక లింకును ఆదివారం అర్థరాత్రి ఏర్పాటు చేసింది. దీనికి అప్లై చేసుకునే వారు హోంపేజీలో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ లింకును క్లిక్ చేయాలి.

అనంతరం ఈపీఎస్ చట్టం 11(3) కింద ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఖాతా ద్వారా పూర్తి చేయాలి. ఈపీఎఫ్ లో రికార్డుల ప్రకారం చందాదారు ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఆధార్ లింక్‌ చేసిన ఫోన్ నంబరును వినియోగించాలి. చందాదారు వివరాలన్నీ ఇలా మొత్తం 4 దశల్లో పూర్తి చేశాక దరఖాస్తు నంబర్ వస్తుంది.


Next Story