వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయాందోళనకు గురైన జనం

by Kema Shiva Kumar |

ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలో ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా ఉదయం 4 గంటల సమయంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్‌, న్యామత్‌ నగర్‌లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో గ్రామస్థలంతా అలర్ట్ అయి ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే, రిక్టర్ స్కేలు భూ ప్రకంపనల తీవ్రత ఎంత నమోదైంది అన్న విషయం తెలియాల్సి ఉంది.

Next Story