సీఎం రేవంత్ రెడ్డితో దగ్గుబాటి ఫ్యామిలీ.. ఆ కేసు కోసమేనా..?

by Disha Web Desk 14 |
సీఎం రేవంత్ రెడ్డితో దగ్గుబాటి ఫ్యామిలీ.. ఆ కేసు కోసమేనా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి ఫ్యామిలీ కలిసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సినీ నటుడు వెంకటేష్, సినీ నిర్మాత సురేష్ బాబు భేటీ అయ్యారు. సీఎంకు పుష్పగుచ్చం అందించి కాసేపు వారు ముచ్చటించారు. ఈ భేటీపై సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ కలవడంపై సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఫామ్ హౌజ్ కేసు నిందితుడు కంప్లైంట్ ఎఫెక్టేనా?

తెలంగాణలో సంచలనం సృష్టించిన (ఎమ్మెల్యేలకు ఎర) ఫామ్ హౌజ్ కేసులో నందకుమార్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అతను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అని, కావాలని అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడని కేసీఆర్ ప్రభుత్వం తరఫున అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నందకుమార్ గతంలో సినీ నిర్మాత దగ్గుబాటి ఫ్యామిలీ తనను మోసం చేసిందని కోర్టుకు ఎక్కారు. అప్పట్లో తనకు లీజుకి ఇచ్చిన భూమిని తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్ చేసి సురేష్ బాబు, వెంకటేశ్ మోసం చేశారని అంతేగాక కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రానా పేరిట రిజిస్ట్రేషన్ చేశారని అప్పట్లో ఆరోపణలు గుప్పించారు. ఇదే కేసు నిమిత్తం రానా పలుసార్లు వాయిదాలకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, ఈ కేసు వ్యవహారంలోనే తాజాగా సీఎం రేవంత్‌ను కలిసి చర్చించినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు నటుడు వెంకటేశ్ ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలవకపోవడం, ఇప్పుడు డైరెక్ట్ సీఎంను కలవడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేవలం సీఎంతో దగ్గుబాటి ఫ్యామిలీ మర్యాదపూర్వకంగా కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.



Next Story

Most Viewed