Covid virus : మళ్లీ కరోనా కలకలం.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం

by Bhoopathi Nagaiah |

దేశంలో కొవిడ్ మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Covid virus : మళ్లీ కరోనా కలకలం.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
X

దేశంలో కొవిడ్ మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని, దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

కేంద్ర ప్రభుత్వం న‌ర‌మేధాన్ని వెంటనే ఆపాల‌ని, మావోయిస్టుల‌తో శాంతిచర్చలు జ‌ర‌పాల‌ని ఎమ్మెల్సీ కోదండ‌రాం డిమాండ్ చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత నంబళ్ల కేశ‌వ‌రావు ఎన్‌కౌంటర్‌ను ఖండించారు. మనుషులను వెంటాడి చంపడం మానవతా విలువలకు, చట్టానికి విరుద్ధమని అన్నారు. తద్వారా ఒక సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవడం సరికాదన్నారు. కోదండరాం ఆగ్రహానికి కారణం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

విశాఖలో సైబర్ డెన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు కాల్ సెంటర్ల ద్వారా విదేశీయులకు వలపు వల వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాగోతంలో మొత్తం 160 మంది యువతీ, యువకులు ఉన్నట్లు నిర్థారణ అయింది. విశాఖ అచ్యుతాపురం కేంద్రంగా ఈ సైబర్ క్రైమ్ కార్యకలాపాలు నడపడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్‌ల వెనుక ముంబైకి చెందిన మహిళ కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వలపు వల గురించి పూర్తి సమాచారం తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

‘ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు శుభాభినందనలు’ అంటూ మంత్రి నారా లోకేశ్​ట్వీట్​చేశారు.యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు తన దృష్టికి తెచ్చారన్నారు. ఇంకా నారా లోకేష్ ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story