- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 13న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు కౌన్సిలింగ్
ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్ఆర్ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బీఎస్సీ (ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ జరగనుందని పేర్కొన్నారు.
ఈ రెండు కౌన్సిలింగ్ లు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్ మెంట్ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, వెబ్ సైట్ లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చన్నారు.






